గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 జులై 2014 (12:55 IST)

వేరు చేసేస్తారేమోనని.. ప్రేయసికి తాళి కట్టేశాడు..!

తన ప్రేయసిని వేరు చేసేస్తారనే భయంతో ఓ ప్రేమికుడు తన ప్రేయసికి రోడ్డు పైనే తాళి  కట్టేశాడు. ఈ తతంగం తమిళనాడు రాష్ట్రంలోని తంజావురులో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అనే ఇద్దరు యువతీ యువకులు అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు. 
 
వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. అయితే వ్యవహారం దివ్య తల్లిదండ్రులకు తెలియరావడంతో ఆమెను వారు మందలించారు. అయినా ఆమె తల్లిదండ్రుల మాట వినకుండా ఆనంద్‌ను తరచూ కలుసుకునేది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆమెను తంజావూరులోని బంధువుల ఇంటికి పంపించారు.
 
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ కూడా తంజావూరు వెళ్లాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన ఆనంద్.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను వెంట తీసుకుని బస్టాండుకు బయల్దేరాడు. దీంతో దివ్యను వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆమెను ఎక్కడ దూరం చేసేస్తారనే భయంతోనే ఆనంద్ రోడ్డుపైనే తాళికట్టేశాడు. పోలీసులకు దివ్య బంధువులు ఫిర్యాదు చేసినా మేజర్లు కావడంతో పోలీసులు కౌన్సిలింగ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.