గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (16:29 IST)

మార్కెట్లోకి 'మోడీ మ్యాంగో: ఆ పండ్లను ప్రధానికి రుచిచూపించాలట!

ప్రధాని నరేంద్ర మోడీ హవా మామిడి పండ్ల మీద కూడా పడింది. ఉత్తరభారత దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాగా పాపులర్ అయిపోతున్నారు.

ఇటీవల మోడీకి ఓ అభిమాని గుడి కట్టి పూజలు చేస్తుంటే, మరొకరు ఆయన పేరును మామిడిపండ్లకు పెట్టారు. లక్నోలోని మలీహాబాద్ శివార్లలో మామిడి పండ్లు పండించే హజీ కలిముల్లా తన తోటలో 'మోడీ మ్యాంగో' పేరుతో మామిడి మొక్కలు నాటాడు. వాటికి పండిన మొదటి పండ్లను ప్రధానమంత్రికి రుచిచూపించాలని అనుకుంటున్నాడు. 
 
"మొదటిగా పండిన మోడీ మ్యాంగో వెరైటీ పండ్లను కేవలం ప్రధానమంత్రి కోసమే ఉంచాను. కానీ వాటిని ఆయనకు పంపించేందుకు నాకెలాంటి అవకాశం లేదు" అని పలురకాల మామిడిపండ్లు పండించడంలో ప్రసిద్ధుడైన, పద్మశ్రీ పురస్కార గ్రహీత కలిముల్లా తెలిపాడు. ఆ పండ్లను ప్రధానికి పంపాలని తన కోరికని, తప్పకుండా ఆయనకు నచ్చుతాయని అనుకుంటున్నట్టు చెప్పాడు.