శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 29 జులై 2015 (08:13 IST)

పాలం విమానాశ్రయానికి అబ్దుల్ కలాం పార్థివదేహం

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పార్థివదేహాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేర్చారు. అక్కడ నుంచి మధురైకు పంపుతారు. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసం నుంచి తరలించారు. 
 
పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురైకి కలాం పార్ధివదేహాన్ని కాసేపట్లో తరలించనున్నారు. తమిళనాడులోని మధురై నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కలాం పార్ధివదేహాన్ని రామేశ్వరానికి తరలించనున్నారు. 
 
అక్కడ ఈ రోజు రాత్రి ఏడు గంటల వరకు ప్రజల సందర్శనార్ధం అనుమతిస్తారు. గురువారం ఉదయం జరగనున్న కలాం అంత్యక్రియలకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.