మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (10:29 IST)

నడిరోడ్డులో యువకుడిని చెప్పుతో కొట్టిన తృప్తి దేశాయ్

ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో కెక్కింది. ఈ సారి ఏ గుడి కోసమో ప

ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ తరుచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో కెక్కింది. ఈ సారి ఏ గుడి కోసమో పోరాటం చేసిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈసారి నడిరోడ్డులో ఓ యువకుడిని చెప్పుతో కొట్టి సంచలనం సృష్టించింది. ఒక మహిళతో సంబంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోడానికి నిరాకరించినందుకు ఆ యువకుడికి తగిన గుణపాఠం చెప్పింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
 
ఆ వివరాలను పరిశీలిస్తే... శ్రీకాంత్ లోంఢే అనే వ్యక్తి ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఆమెను లోబరచుకున్నాడు. దీంతో ఆమె గర్భవతి కూడా అయ్యింది. అంతేకాదు గర్భవతి అయిన ఆ అమ్మాయిని అబార్షన్ చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తప్పించుకున్నాడు. ఆ యువ‌తిని చీట్ చేసినందుకు అందరూ చూస్తుండగా పుణె - అహ్మద్నగర్ రోడ్డుపై శిర్వాల్ అనే గ్రామం వద్ద అతనిని చెప్పుతో కొట్టింది. 
 
ఆ యువకుణ్ణి చెప్పుతో కొడుతున్న‌ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ యువకుడు మరో ఇద్దరు మహిళలను కూడా ఇలాగే మోసం చేశాడని, అందుకే అతనికి బుద్ధి చెప్పానని తృప్తి అన్నారు. అయితే ఈ చర్యను కొందరు నెటిజన్లు తప్పుపడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె చర్యను సమర్ధిస్తున్నారు.