గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (19:19 IST)

మరదలికి సినిమా ఛాన్స్ నో.. హీరోకు గుండుగీచిన బావ..!

మరదలికి సినిమా ఛాన్స్ ఇవ్వలేదనే కోపంతో హీరోపై దాడిచేసి గుండు గీసాడు ఆ అమ్మాయి బావ. ఈ సంఘటన కర్ణాటకలోని బళ్లారిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఆడిషన్స్ తీసుకోవడానికి అర్జున్ అనే యువ హీరో కర్ణాటకలోని బళ్లారికి వచ్చారు. 
 
ఆ సమయంలో రోష్ని అనే యువతి అతని వద్దకు వచ్చి తనకు హీరోయిన్ అవకాశం ఇవ్వాలని కోరింది. ఆమెకు నటనలో అనుభవం లేక పోవడం చేత ఆయన తిరస్కరించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రోష్ని బావ అమిత్ ఆవేశంతో ఊగిపోయాడు. తనతోపాటు సుమారు 20 మంది ముఠాను తీసుకెళ్లి హీరోను చితకబాది గుండుగీసి పరారైయ్యాడు. అనంతరం అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
తనతో పాటు భార్య పూజ, మరో నటుడిపై కూడా రోష్ని బావ దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితునిపై ప్రేమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ దాఖలైంది. అజ్ఞాతంలో ఉన్న అమిత్ కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై తీవ్రంగా గాలిస్తున్నట్టు ఎస్పీ రాజీవ్ మల్హోత్రా తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.