శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (17:36 IST)

సొంత డబ్బా కొట్టుకునేందుకు భారీ కేటాయింపులా?: కేజ్రీపై అజయ్ ఫైర్

ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారు ప్రచార కార్యక్రమాల కోసం రూ.526 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించడంపై విపక్షాలు ఫైర్ అయ్యాయి. దీనిపై కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ తీవ్రంగా స్పందిస్తూ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర కొరియా నియంతతో పోల్చారు. సొంత డబ్బా కొట్టుకునేందుకు ఇంత భారీ కేటాయింపులా? అని ప్రశ్నించారు.
 
ప్రచారం కోసం రూ. 30 కోట్ల నుంచి రూ. 40 కోట్ల వ్యయం అవసరమా అని అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ డబ్బును రోగులకు మెరుగైన చికిత్స కోసమో, ఆసుపత్రుల ఏర్పాటు కోసమో.. పాఠశాలలు, రోడ్ల నిర్మాణం కోసమో వెచ్చిస్తే బాగుంటుందని, ఆప్ సర్కారు ప్రకటనలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పును గమనించాలని సూచించారు. ఉత్తర కొరియా నియంత తనను తాను గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని కేజ్రీవాల్ ఆ నియంతలా తయారవుతున్నారని దుయ్యబట్టారు.