శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 20 అక్టోబరు 2014 (16:31 IST)

జయ కోసం 193 మంది మృతి... ఓదార్చడం కుదరదు కానీ....

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారన్న వార్తను తెలుసుకుని తట్టుకోలేక ఇప్పటివరకూ 193 మంది మరణించినట్లు అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. ఐతే మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు కోర్టు నిబంధనల ప్రకారం జయలలిత బయటకు వెళ్లడం సాధ్యం కాదు కనుక ఒక్కో కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది ఆ పార్టీ. 
 
చనిపోయిన వారి వివరాలను తెలియజేస్తూనే... చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు తెలిపింది. తనకోసం పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఇలాంటి పనులకు పూనుకోవద్దని మాజీముఖ్యమంత్రి జయలలిత విజ్ఞప్తి చేశారు.