శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (10:41 IST)

నిర్భయ దోషులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారట..

దేశాన్ని నిర్భయ ఘటన కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేరంలో నిందితులైన నలుగురికి ఉరిశిక్ష ఖరారైంది. వీరు ప్రస్తుతం తీహార్ జైలులో వున్నారు. ఇంతకాలం కామ్‌గా వుండిన నిర్భయ దోషులు ఉరికంబం ఎక్కే రోజులు దగ్గరపడటంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

తీహార్ జైల్లో ఉన్న నలుగురు నిర్భయ దోషులకూ ఇప్పుడు మరణభయం పట్టుకుంది. తమపై డెత్ వారెంట్ జారీ కావడం, క్యూరేటివ్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో.. ఈ నెల 22వ తేదీన ఉరితీతకు జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నలుగురు దోషులూ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తూ, ఏంటేంటో చేస్తున్నారని, వారికి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని జైలు వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా వినయ్ శర్మ ఎంతో ఆందోళనతో ఉన్నాడని తెలుస్తోంది. నలుగురిలో వినయ్ అత్యంత పిన్న వయస్కుడన్న సంగతి తెలిసిందే. తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ, చాలా భయంతో ఉంటున్నాడని జైలు అధికారులు చెప్తున్నారు.
 
ముఖ్యంగా వినయ్ శర్మ ఎంతో ఆందోళనతో ఉన్నాడని తెలుస్తోంది. నలుగురిలో వినయ్ అత్యంత పిన్న వయస్కుడన్న సంగతి తెలిసిందే. తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ, చాలా భయంతో ఉంటున్నాడని జైలు అధికారులు తెలిపారు. ఉరి శిక్ష అమలు తేదీని ప్రకటించిన తరువాత దోషుల బంధువులు వారిని దూరం పెట్టారని, ఒకరిద్దరు మినహా వారితో ములాఖత్ కు ఎవరూ రాలేదని ఆ వర్గాలు వెల్లడించాయి.