బీహార్ భాజపా యూనిట్ చీఫ్గా నిత్యానంద...
దేశంలో భాజపాకు పట్టులేని రాష్ట్రాల్లో మరింత పుంజుకునేందుకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికులు రచిస్తున్నారు. ఇందులోభాగంగా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను, ఇంచార్జిలను మారుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడుగా కొత్తగా మనోజ్ తివారీన
దేశంలో భాజపాకు పట్టులేని రాష్ట్రాల్లో మరింత పుంజుకునేందుకు భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రణాళికులు రచిస్తున్నారు. ఇందులోభాగంగా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను, ఇంచార్జిలను మారుస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడుగా కొత్తగా మనోజ్ తివారీని ఎంపిక చేశారు. సతీష్ ఉపాధ్యాయ్ స్థానంలో ఈయనను కూర్చోబెడుతున్నారు.
అలాగే బీహార్ యూనిట్ చీఫ్గా నిత్యానంద రాయ్ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. లాలూ ప్రసాద్ యాదవ్ను ధీటుగా ఎదుర్కొనగలిగే సామర్థ్యం నిత్యానందకు ఉన్నదని అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది.