శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 27 జులై 2015 (22:01 IST)

అబ్దుల్ కలాం చివరి ట్విట్టర్ మెసేజ్ ఇదే...

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చివరగా తన ట్విట్టర్ అకౌంట్‌లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. షిల్లాంగ్ ఐఐటీలో శ్రీజన్‌పాల్ సింగ్, శర్మతో కలిసి లైవబల్ ప్లానెట్ ఎర్త్ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చేందుకు షిల్లాంగ్ వెళ్తున్నా అని అందులో పేర్కొన్నారు. ఈ సందేశం సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇవ్వగా, ఆయన సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కన్నుమూశారు.
 
 
అలాగే ఈనెల 19వ తేదీన తన గురువు 92 యేళ్ల చిన్నదురైను దిండిగల్‌లో కలుసుకుని ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తన గురువుకు అబ్దుల్ కలాం సన్మానం కూడా చేశారు. పుదుక్కోట్టై జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తూ మార్గమధ్యంలో తన గురువును కలిసి సన్మానించి గురువుపై తనకున్న ప్రేమను చాటిన మహనీయుడు ఈ మిస్సైల్ మ్యాన్.