శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 3 మే 2018 (14:33 IST)

జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. రాష్ట్రపతి గంటే వుంటారట

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి తీసుకున్న ఓ నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది. 65వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానం వేడుక గురువారం సాయంత్రం విజ్ఞాన్‌ భవన్‌లో జరగనుంది.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రపతి తీసుకున్న ఓ నిర్ణయం ఈ వివాదానికి కారణమైంది. 65వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానం వేడుక గురువారం సాయంత్రం విజ్ఞాన్‌ భవన్‌లో జరగనుంది. 
 
రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలందరూ అవార్డులను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ కార్యక్రమానికి కోవింద్‌ గంట మాత్రమే అపాయింట్‌మెంట్‌ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా కొందరు విజేతలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించటం దుమారం రేపింది.  
 
కాగా ఈ ఏడాది మొత్తం 140 మంది చలన చిత్ర అవార్డులను గెలుచుకున్నారు. ఈ అవార్డులను రాష్ట్రపతి చేతులమీదుగా అందజేయాల్సి వుంటుంది. కానీ రాష్ట్రపతి గంట మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారని.. 11 అవార్డులను మాత్రమే అందజేస్తారని.. మిగిలిన అవార్డులను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అందిస్తారని రాష్ట్రపతి కార్యాలయం నిర్వాహకులకు తెలిపింది. దీనిపై విజేతలు చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
గతే ఏడాది జరిగిన కార్యక్రమంలో ప్రణబ్‌ ముఖర్జీ(82) ఎంతో ఓపికగా విజేతలకు అవార్డులను అందజేయగా.. కోవింద్ మాత్రం గంట సేపే ఈ కార్యక్రమంలో వుండటం చాలామందికి నచ్చలేదని జాతీయ మీడియా కోడైకూస్తోంది.