శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (17:01 IST)

ఘనంగా కర్ణాటక అవతరణోత్సవాలు... బెంగళూరుగా మారిన బెంగళూర్...

కర్ణాటక రాష్ట్రం 59వ అవతరణ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర రాజధాని బెంగళూర్‌ను బెంగళూరుగా మార్పు చేశారు. బెంగళూరుతో పాటు ఆ రాష్ట్రంలోని మరో 11 నగరాల పేర్లను అధికారికంగా మార్చారు.
 
'కర్ణాటక ప్రభుత్వం కన్నడ బాష ఉచ్ఛరణ ప్రకారం రాజధానితో పాటు మరో 11 నగరాల పేర్లను మార్చాలని నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. స్థానిక భాష ప్రకారం పేర్లలో మార్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది' అని అధికారి ఒకరు చెప్పారు.
 
ఆ రాష్ట్రంలోని బెంగళూర్‌ను బెంగళూరుగాను, మైసూర్-మైసూరు, మంగళూర్-మంగళూరు, బెల్గాం-బెలగావి, హుబ్లి-హుబ్బళ్లి, గుల్బర్గా-కలబుర్గి, బీజాపూర్-విజయపుర, చిక్మగళూర్-చిక్కమగళూరు, హోస్పేట్-హోస్పేట, షిమోగా-శివమొగ్గ, టుంకూర్-టుమకూరు, 
బెళ్లారి-బళ్లారి గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.