గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (11:47 IST)

ఫేస్‌బుక్, వాట్సాప్‌లు వాడే అమ్మాయిలా? వద్దే వద్దంటున్న యువకులు?

స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లంటేనే యువత పడిచస్తోంది. యువకులు, యువతులు ప్రస్తుతం సోషల్ మీడియాపై మోజు పెంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాను తెగ వాడే అమ్మాయిలకు పెళ్ళిళ్లు కావ

స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లంటేనే యువత పడిచస్తోంది. యువకులు, యువతులు ప్రస్తుతం సోషల్ మీడియాపై మోజు పెంచుకుంటోంది. అయితే సోషల్ మీడియాను తెగ వాడే అమ్మాయిలకు పెళ్ళిళ్లు కావడం గగమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
కొన్ని సంవత్సరాల క్రితం అమ్మాయిని ఫిక్స్ చేసుకుని వరుడు కుటుంబీకులు.. అమ్మాయి గురించి పక్కనక్కన విచారించుకోవడం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. సోషల్ మీడియాను చూసి అమ్మాయి ఎలాంటిదో బేరీజు వేస్తున్నారు.

ఎందుకుంటే సోషల్ మీడియా వ్యసనంగా మార్చుకునే అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు యువకులు అంతగా ఆసక్తి చూపట్లేదట. ఈ విషయాన్ని పేర్కొంటూ మ్యాట్రిమోనియల్ ప్రకటనలు కూడా వస్తున్నాయని తేలింది. 
 
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబ్బాయిలు ఈ విషయం గురించి ఎక్కువగా ఆరా తీస్తున్నారట. అమ్మాయిలు ఫేస్ బుక్, వాట్సాప్‌లను అధికంగా వాడితే.. తమ వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారట ఇప్పటికే ఫేస్‌బుక్‌, వాట్సాప్ వాడుతుండ‌టం వ‌ల్ల భ‌ర్త‌ను, పిల్ల‌ల‌ను నిర్ల‌క్ష్యం చేసే మహిళల సంఖ్య పెరిగిందని సర్వేలో తేలింది. 
 
అందుకే తాము మనువాడే అమ్మాయిలను ఎంచుకునే విషయంలో యువకులు అప్రమత్తంగా వున్నారని తెలుస్తోంది. సో అమ్మాయిలు ఇక సోషల్ మీడియా వాడకం పట్ల అప్రమత్తంగా వుండాలి.