శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (16:02 IST)

భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని.. మోడీ స్వాగతం

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనబెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటనకు వచ్చారు. ఆయనకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రోటోకాల్‌ నిబంధనలను పక్కనబెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆయనకు ఆత్మీయంగా స్వాగతం పలికారు. నెతన్యాహును మోదీ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతోపాటు ఆయన సతీమణి సారా నెతన్యాహు కూడా ఉన్నారు.
 
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి మన దేశానికి రావడం 15 ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి. పదిహేనేళ్ళ క్రితం 2003లో ఆ దేశ ప్రధాని ఏరియల్ షరాన్ మన దేశానికి వచ్చారు. నెతన్యాహు ప్రయాణించిన విమానంపై భారతదేశం, ఇజ్రాయెల్ దేశాల జాతీయ పతాకాలు ఉన్నాయి. నెతన్యాహు మన దేశంలో 6 రోజులపాటు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై పోరాటం, వ్యాపార సంబంధాల బలోపేతం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి.
 
ఈ సందర్భంగా తీన్‌ మూర్తి చౌక్‌ పేరును తీన్‌ మూర్తి హైఫీ చౌక్‌గా మార్చనున్నారు. నెతన్యాహు పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఆదివారం రాత్రి ఆయనకు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. నెతన్యాహు వెంట ముంబై పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడిన 11 యేళ్ల బాలుడు మోషే కూడా భారత్‌ వచ్చాడు.