బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 30 నవంబరు 2015 (15:01 IST)

బీహార్‌‌లో ఆర్ఎస్ఎస్పీ ఎమ్మెల్యే బసంత్‌ కుశ్వాహా కన్నుమూత

బీహార్ రాష్ట్ర శాసనసభకు కొత్తగా ఎన్నికైన బసంత్ కుశ్వాహా సోమవారం హఠాత్మరణం చెందారు. ఆయనకు వయస్సు 54 యేళ్లు. గత కొద్ది రోజులుగా ఛాతి నొప్పితో బాధపడుతున్న కుశ్వాహాను కుటుంబసభ్యులు నాలుగు రోజుల క్రితమే ఆస్పత్రిలో చేర్పించారు. 
 
అయితే ఈరోజు తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మరణించారని వైద్యులు తెలిపారు. ఎన్డీయే కూటమిలోని రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో గెలుపొందగా, అందులో ఒకటి బసంత్‌ కుశ్వాహాది.
 
కాగా, ఈ మరణవార్తను తెలుసుకున్న బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుశ్వాహా నివాసానికి వెళ్లి భౌతికకాయానికి అంజలి ఘటించారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పాట్నాలోని పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు.