గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (14:56 IST)

బీహార్‌లో దారుణం: విద్యార్థిని హత్య.. బైకుపై వెళ్తూ చున్నీ మెడకు చుట్టి.. ఈడ్చుకెళ్లారు..!

మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై పదో తరగతి విద్యార్థినిని పాశవికంగా హత్య చేశారు. 15 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు తమ బైకుతో పాట

మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై పదో తరగతి విద్యార్థినిని పాశవికంగా హత్య చేశారు. 15 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు తమ బైకుతో పాటు ఈడ్చుకెళ్లి దారుణంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ కైముర్ జిల్లా కార్జావ్ గ్రామంలో హాటా-దుర్గావతి ప్రధాన రహదారిపై మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. 
 
ఫకరాబాద్ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె చున్నీ పట్టుకుని లాగారు. మెడకు చున్నీ చుట్టుకుని ఆమె కింద పడిపోయింది. ఆమెను బైకుతో 50 మీటర్ల వరకు ఈడ్చుకుపోయారు. అక్కడితో ఆగకుండా ఆమెపైనుంచి బైకు నడిపారు. తీవ్రగాయాలతో బాధితురాలు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. 
 
బైకు గోతిలో పడి ముగ్గురు దుండగులు కిందపడ్డారు. వీరిని స్థానికులు పట్టుకోవడానికే ప్రయత్నించడంతో బైకు అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేశారు.