గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (14:36 IST)

బిడ్డ ఏడుపు ఆపలేదని.. ఫెవిక్విక్‌ను నోటికి అంటించింది..

రాను రాను మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. నేరాల సంఖ్య పెచ్చరిల్లిపోతున్నాయి. ఊరకే ఏడుస్తుందని.. పసిబిడ్డపై  కన్నతల్లి పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అభం శుభం తెలియని పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ప్రాణాల మీదకు తెచ్చింది. 
 
చిన్నారి ఏడుపును ఆపలేదని.. గమ్‌ను నోటికి అంటించింది. ఈ దారుణ ఘటన బీహార్‌లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శోభ అనే మహిళ తన భర్త,  ఏడాదిన్నర వయసున్న కుమారుడితో కలిసి ఛాప్రాలో నివాసం ఉంటుంది. 
 
తన కొడుకు పదే పదే ఏడుస్తుండటంతో సముదాయించాల్సింది పోయి దారుణానికి ఒడిగట్టింది. భర్త ఇంట్లోలేని సమయంలో కుమారుడి పెదాలకు ఫెవిక్విక్‌ పూసింది. దీంతో చిన్నారి నోట్లో నుంచి నురగ వచ్చింది. ఈలోగా ఇంటికి వచ్చిన శోభ భర్త దీన్ని గమనించాడు.
 
ఎందుకిలా జరిగిందని అతడు ప్రశ్నించడంతో ఫెవిక్విక్‌తో అంటించానని చెప్పింది. దీంతో షాక్ అయిన శోభ భర్త.. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయం తప్పింది. శోభపై పోలీసులు కేసు నమోదు చేశారు.