వచ్చే యేడాది నుంచి బీహార్లో సంపూర్ణ మద్య నిషేధం : నితీశ్ కుమార్
ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు వచ్చే యేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించనున్నట్టు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన గురువారం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
వరుసగా మూడోసారి బీహార్ పీఠాన్ని అధిరోహించిన నితీశ్ కుమార్.. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా తొలి హామీని అమలు చేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఆ ప్రకారంగా వచ్చే ఏడాది (2016) ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారు.