శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 27 జులై 2017 (03:00 IST)

లాలూ చస్తే మారడు.. అందుకే నితీశే మారిపోయాడు.. బీజేపీ స్కెచ్‌కి మహాకూటమి ఔట్

భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి బలవంతంగా వెళ్లిపొమ్మని చెప్పనూలేక, కలిసి పనిచేయలేనూలేక నితీశ్ కుమార్‌ తనంతటతానే రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఇద్దరు మిత్రులు నితీశ్‌ కుమార్

భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం నుంచి బలవంతంగా వెళ్లిపొమ్మని చెప్పనూలేక, కలిసి పనిచేయలేనూలేక నితీశ్ కుమార్‌ తనంతటతానే రాజీనామా చేశారు. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఇద్దరు మిత్రులు నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు.. ఏడాదిన్నర తిరిగేసరికి అంతే సంచలనాత్మకంగా విడిపోయారు. ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ రాజీనామా చేయడంతో రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్‌జేడీ)- జనతాదళ్‌ యునైటెడ్‌(జేడీయూ)- కాంగ్రెస్‌ పార్టీల మహాకూటమి(మహాఘట్బంధన్‌) ప్రభుత్వం బుధవారం కుప్పకూలిపోయింది. ‘రాజకీయాల్లో ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయ’నే విషయం తెలిసి కూడా నితీశ్‌ సీఎం పీఠాన్ని ఎలా త్యజించగలిగారు అంతపెద్ద సాహసానికి ఎలా సిద్ధపడ్డారు?
 
గడిచిన కొద్ది నెలలుగా.. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ భారీ వ్యూహంతో ముందుకు వెళుతోంది. దాని వ్యూహాల్లో అతి ప్రధానమైనవి.. వ్యతిరేక శక్తులను చిత్తు చేయడం, కలసివచ్చేవాళ్లకు గట్టి నమ్మకాన్ని కల్పించడం.  మహాకూటమి ప్రభుత్వం నడుస్తుండగానే.. ‘నితీశ్‌ బజేపీ మద్దతు తీసుకుని.. లాలూను పక్కన పెట్టాలి’ అని సాక్షాత్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్‌ కుమార్‌ మోదీ బాహాటంగా ప్రకటన చేశారు. ఒకటికాదు.. రెండు కాదు.. (యూపీ ఎన్నికల తర్వాత) సుశీల్‌ మోదీ ఈ మాటను ఏ వందసార్లో అని ఉంటారు.]
 
మద్దతు ఇస్తామని చెప్పినంత మాత్రాన నిజంగా ఇస్తారా ప్రభుత్వం కూలిపోతే, ఎన్నికలు అనివార్యమైతే బీజేపీ తన లాభం తాను చూసుకోవాలనుకుంటుందికానీ తిరిగి నితీశ్‌ను పీఠంపై కూర్చోబెడుతుందా.. అనే ప్రశ్నలు తలెత్తుతాయి కానీ.. సరిగ్గా ఇక్కడే బీజేపీ గెలిచింది. ‘విశ్వసనీయత’ అనే పాచికతో నితీశ్‌ను మంచిచేసుకుంది. 
 
మహాకూటమికి ముందు నితీశ్‌(జేడీయూ) 17 ఏళ్లపాటు ఎన్డీఏలో భాగస్వామి. కాబట్టి ఆయనకు బీజేపీ ఎలా పనిచేస్తుందో, అది కాంగ్రెస్‌ కంటే ఏ మేరకు భిన్నమైనదో, మాట ఇస్తే కట్టుబడి ఉంటుందో లేక నీరుగారుస్తుందో అనే విషయాలపై స్పష్టత ఉంది. ప్రస్తుత పరిపాలన తీరు ఎలా ఉన్నా, పార్టీ పరంగా ‘మాటంటే మాటే’ అనే సిద్ధాంతాన్ని బీజేపీ మొదటినుంచీ కొనసాగిస్తోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లో సైతం స్థానిక పార్టీలతో బీజేపీ సాగించే స్నేహం.. కాంగ్రెస్‌ పార్టీ స్నేహం కంటే చాలా భిన్నమైనది.
 
దీంట్లో బాగంగానే ముందుగా బీహార్ బీజేపీ నేత సుశీల్‌ మోదీ ‘అటు నుంచి నరుక్కురావడం..’ ప్రక్రియను మొదలుపెట్టారు. తొలుత నితీశ్‌కు ఓపెన్‌ ఆఫర్‌(బీజేపీ మద్దతు) ప్రకటించారు. తేడా వచ్చి లాలూ దూరమైతే నితీశ్‌కు బీజేపీ అండ ఉంటుందనే నమ్మకాన్ని జేడీయూ శ్రేణులకు, ప్రజలకు కల్పించారు. ఆ తర్వాత లాలూ కుటుంబంపై వరుస దాడులు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు లాలూ కుటుంబం అక్రమ ఆస్తులను తిరగతోడాయి. ఆరోపణల నేపథ్యంలో లాలూ కుమారులు తేజస్వీ, తేజ్‌ప్రతాప్‌లు రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి. కానీ నితీశ్‌ వాళ్ల రాజీనామాను కోరలేదు. కళంకితులతో కలిసి పనిచేయలేనని చెప్పి తెలివిగా లాలూ కౌగిలి నుంచి జారుకున్నారు.