బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 2 జులై 2017 (13:17 IST)

గో సంరక్షణ పేరుతో హత్య.. బీజేపీ నేత అరెస్టు

గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం తీసుకెళుతున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ

గో సంరక్షణ పేరుతో హత్యలు ఏమిటని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించిన రోజే పశుమాంసం తీసుకెళుతున్నాడన్న ఆరోపణలతో ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెల్సిందే. దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. గో సంరక్షణ పేరుతో హత్యలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. 
 
గతవారంలో తన కారులో మాంసం తీసుకు వెళుతున్నాడని ఆరోపిస్తూ, ఓ వ్యక్తిపై దాడి చేసి కొట్టి చంపడమే కాకుండా, కారును దహనం చేసిన కేసులో రామ్‌గఢ్ బీజేపీ మీడియా ఇన్ చార్జ్ నిత్యానంద మహతోను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్థానిక పార్టీ నేత పప్పూ బెనర్జీ, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. 
 
అలీముద్దీన్ అనే వ్యక్తిపై దాడి చేసి దారుణంగా కొట్టి, అతని మారుతి వ్యాన్‌ను దగ్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిత్యానంద ప్రోద్బలంతోనే అల్లరిమూక రెచ్చిపోయినట్టు తమ వద్ద వీడియో సాక్ష్యం ఉందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ హత్య ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని అనుమానిస్తున్నామని, నిత్యానందకు, అలీముద్దీన్‌కూ పాత గొడవలు ఉన్నాయని తెలిపారు.