గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (11:17 IST)

బీజేపీ ఎంపీలకు నరేంద్ర మోడీ స్ట్రిక్ట్ రూల్స్....

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కఠినమైన నియమ నిబంధనలు పెట్టారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బీజేపీ సభ్యులు విదేశాలకు ఎట్టి పరిస్థితుల్లోను వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. అలాగే, పార్టీ కీలక సమావేశాలకు బీజేపీ ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని పేర్కొన్నారు. 
 
పార్టీ అధికార ప్రతినిధులు ఖచ్చితంగా ప్రతి మంగళవారం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ‌తో విధిగా సమావేశం కావాలనీ, పార్టీని సంప్రదించకుండా బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఏ రకమైన తీర్మానాలనూ ప్రవేశ పెట్టకూడదని కోరారు. 
 
దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు స్పందిస్తూ... ప్రతి వారం పార్టీ సమావేశాల వివరాలను మోడీకి పంపిస్తామని... పార్టీ ఎంపీల పని తీరును మోడీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారని చెప్పారు. ఎంపీల పనితీరును బట్టే వారికి తర్వాతి రోజులలో ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.