మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2015 (09:54 IST)

జనతా పరివార్.. ముఠాకోరుల కూటమి : బీజేపీ నేత అక్బర్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాకు ఎదురొడ్డి నిలబడేందుకు ఆరు పార్టీలతో ఏర్పడిన జనతా పరివార్ కూటమిపై బీజేపీ నేతలు పరుష పదజాలంతో విరుచుకుపడుతున్నారు. ఈ కూటమి ఏర్పాటుపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్ మాట్లాడుతూ.. జనతా పరివార్ అనేది మూఠాకోరుల కూటమి అని వ్యాఖ్యానించారు. 
 
అంతేకాక బీహార్ ఎన్నికల తర్వాత జనతా పరివార్ అడ్రెస్ కూడా కనిపించదని జోస్యం చెప్పారు. అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందిస్తూ.. సున్నాతో సున్నా కలిస్తే సున్నానే వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలపై అక్బర్ మాట్లాడుతూ.. ‘జనతా పరివార్ తాత్కాలిక కూటమి. బీహార్‌లో బీజేపీ, మోడీని ఎదుర్కొనడమే దీని లక్ష్యం. కూటమిలోని నేతలు... మంచి పరిపాలనను అందించేందుకు వచ్చిన అవకాశంగా కాక... వచ్చిన సీట్లు, పోయిన ఓట్లుగా ఎన్నికలను చూస్తున్నారు’ అని ఆయన విమర్శించారు.