శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (13:52 IST)

వార్డుకో మండపం చాలు... ముంబైలో వినాయక చవితి వేడుకలపై హైకోర్టు ఆంక్షలు

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించింది. వార్డుకో మండపం చాలనీ, భారీ హంగులతో ఉరేగింపు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 
 
భారత న్యాయ నిబంధనల ప్రకారం, ఇటువంటి కార్యకలాపాలకు తాము దూరం అంటూ, నగరం మొత్తం స్తంభించేలా వేడుకలు అవసరమా? అని ప్రశ్నించింది. భారీ హంగులతో, ఊరేగింపులతో పండగ నిర్వహించడం మానుకోవాలని, ఒక వార్డుకు ఒక మండపం చాలని అభిప్రాయపడింది. 
 
వినాయక మండపాలను ప్రారంభించిన లోకమాన్య తిలక్ బతికుంటే, ఇప్పటి ఉత్సవాల తీరును తప్పుబట్టేవారని వ్యాఖ్యానించిన కోర్టు, మండపాల పేరిట ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నారని, భారీ మైక్ సెట్లతో గాలిని కలుషితం చేస్తున్నారని చెబుతూ, నిశ్శబ్దంగా పూజలు చేసుకోలేమా? అని ప్రశ్నిస్తూనే శివాజీ పార్కులో పూజలకు అంగీకరించమని తేల్చి చెప్పింది.