గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (20:46 IST)

ఆహార నాణ్యతపై వీడియో పెట్టిన జవాన్ ఏమయ్యాడు? ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు

సోషల్ మీడియాలో సైనిక ఆహార నాణ్యతపై వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు కనిపించట్లేదని ఆయన కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని భార్య ష‌ర్మిల ఇటీవ‌లే మీడియా ముందుకు వ‌చ్చి తన భర్

సోషల్ మీడియాలో సైనిక ఆహార నాణ్యతపై వీడియో పోస్ట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ అనే సైనికుడు కనిపించట్లేదని ఆయన కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతని భార్య ష‌ర్మిల ఇటీవ‌లే మీడియా ముందుకు వ‌చ్చి తన భర్తను అధికారులు అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. 
 
గురువారం కూడా షర్మిల భర్తపట్ల ఆవేదన వ్యక్తం చేసింది. పలుసార్లు ఫోన్లు చేసినా ఎటువంటి స్పందనా రావడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ప‌లుసార్లు ఫోన్‌ హోల్డ్‌లో పెట్టేస్తున్నారని, మరికొన్ని సార్లు లిఫ్ట్‌ చేసి పక్కన పెట్టేస్తున్నారని జవాను సోదరుడు విజయ్ ఆరోపించాడు. 
 
ఈ నేపథ్యంలో త‌న భ‌ర్త ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పెట్టిన‌ప్ప‌టి నుంచి క‌నిపించ‌డంలేద‌ని జవాను భార్య ఆవేదన వ్యక్తం చేసింది. త‌న భ‌ర్త‌తో కనీసం ఫోన్‌లో అయినా మాట్లాడేందుకు అధికారులు ఒప్పుకోవ‌డం లేద‌ని వాపోయింది.  దీంతో గురువారం ఢిల్లీ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ కింద పిల్‌ను దాఖలు చేశారు. బీఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ కెకె.శర్మకు న్యాయస్థానం లీగల్‌ నోటీసులు పంపించనుంది.