శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 జులై 2016 (14:30 IST)

దయా శంకర్ సింగ్ నాలుక తెచ్చే వారికి రూ.50 లక్షలిస్తా: జన్నత్ జహాన్

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దయా శంకర్ సింగ్‌పై ఛండీగడ్ నగర బీఎస్పీ అధ్యక్షురాలు జన్నత్ జహాన్ మండిపడ్డారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపై దయాశంకర్ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఖ

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దయా శంకర్ సింగ్‌పై ఛండీగడ్ నగర బీఎస్పీ అధ్యక్షురాలు జన్నత్ జహాన్ మండిపడ్డారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపై దయాశంకర్ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆమె.. ఆయన నాలుక కోసి తెచ్చిన వారికి రూ.50 లక్షలు ఇస్తానని జహాన్ భారీ ఆఫర్ ప్రకటించారు. 
 
దయాశంకర్ సింగ్‌పై చర్యలు తీసుకున్నామని, ఆతని వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని.. ఈ వివాదం ముగిసిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్టేట్మెంట్ ఇచ్చినా.. మాయావతిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
 
ఇదిలా ఉంటే దయాశంకర్ సింగ్‌పై ఉచ్చు బిగుస్తోంది. నోరు జారి కష్టాలు కొనితెచ్చుకున్న దయాశంకర్ సింగ్‌ను బీజేపీ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. దయాశంకర్‌పై కేసు నమోదు కావడంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గురువారం పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో పలుచోట్ల సోదాలు జరిపారు.