శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (16:06 IST)

గంగానదిలో మొత్తం అస్థికలు కలపవద్దు: సత్యపాల్ సింగ్

గంగానదిలో అస్థికలు కలపడమనేది హిందువుల విశ్వాసమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ అన్నారు. గంగానదిలో కాలుష్యాన్ని అరికట్టే నిమిత్తం నదిలో అస్థికలు

గంగానదిలో అస్థికలు కలపడమనేది హిందువుల విశ్వాసమే అయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ అన్నారు. గంగానదిలో కాలుష్యాన్ని అరికట్టే నిమిత్తం నదిలో అస్థికలు మొత్తం కలపవద్దని సత్యపాల్ సింగ్ సూచించారు.

కొన్నిటిని మాత్రమే గంగలో కలిపి, మిగిలిన అస్థికలను నదీపరీవాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి, దానిపై ఓ మొక్కను నాటాలని మంత్రి తెలిపారు. ఇందుకుగాను పురోహితులు, హిందూ ఆధ్యాత్మికవేత్తలు కృషి చేయాలని.. ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు.
 
కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో నమామి గంగ ఒకటి. మోదీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోన్న విమర్శలు వచ్చాయి. ఈ పథకం పట్టాలెక్కేందుకు రెండేళ్లు పట్టింది. 
 
మరోవైపు గంగాప్రక్షాళన ప్రాజెక్ట్ కాదు. మన పాపానికి ప్రాయశ్చిత్తం. ఇన్నేళ్లు దాని అస్థిత్వాన్ని కాపాడుకోలేకపోయినందుకు సిగ్గుపడాలని గత ప్రభుత్వాల తప్పిదాన్ని కేంద్ర మంత్రి ఉమాభారతి ఎత్తిచూపారు. గంగా ప్రక్షాళనతో మోక్ష మార్గాన్ని చూపిస్తామని ప్రకటించారు. అయితే కాగ్ మాత్రం గంగ ప్రక్షాళనలో కేంద్రం ప్రభుత్వం నిధులను సక్రమంగా ఉపయోగించుకోవడంలో విఫలమైందని నివేదికలో తెలిపింది.