శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (14:51 IST)

రైల్వే పార్శిల్ ఆఫీసులో యువతితో హెడ్ క్లర్క్ రాసలీలలు..

రాత్రిపూట విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్‌ క్లర్క్ ఓ యువతితో రాసక్రీడల్లో మునిగితేలాడు. మొత్తం 90 నిమిషాల పాటు ఆయన సాగించిన రాసలీలలు సీసీటీవీలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి. ఇపుడు ఈ ఫుటేజ్‌ లీక్ కావడంతో హెడ్ క

రాత్రిపూట విధి నిర్వహణలో ఉన్న ఓ హెడ్‌ క్లర్క్ ఓ యువతితో రాసక్రీడల్లో మునిగితేలాడు. మొత్తం 90 నిమిషాల పాటు ఆయన సాగించిన రాసలీలలు సీసీటీవీలో భద్రంగా నిక్షిప్తమయ్యాయి. ఇపుడు ఈ ఫుటేజ్‌ లీక్ కావడంతో హెడ్ క్లర్క్ బండారం బయటపడింది. ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్‌లోని పార్శిల్ కార్యాలయంలో ఈ తంతు చోటుచేసుకుంది. 
 
లోకమాన్య తిలక్ టెర్మినల్‌ పార్శిల్ విభాగంలో అజయ్ బోస్ అనే వ్యక్తి హెడ్ క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఈయన గతంలో అనేక అక్రమాలు, స్కామ్‌లకు పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ... తన పలుకుబడి, పరపతితో ఉద్యోగంలో కొనసాగుతున్నాడు.
 
ఈనేపథ్యంలో తాజాగా ఆయన రాత్రివేళ విధులు నిర్వహిస్తూనే ఓ యువతితో రాసక్రీడల్లో మునిగితేలాడు. ఈ పాడుపని సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా రికార్డయింది. మొత్తం 90 నిమిషాల నిడివి గల ఈ సీసీటీవీ ఫుటేజ్‌లో యువతి చేతులు పట్టుకొని చెట్టాపట్టాలేసుకోవడం, పక్కపక్కన కూర్చొని భోజనం చేయడం, యువతి పడుకోవడం నుంచి దుస్తులు మార్చుకోవడందాకా అంతా రికార్డయింది. 
 
ఆ యువతిని తీసుకువచ్చిన ట్యాక్సీ డ్రైవరు కూడా క్లర్కు బెంచీపై పడుకోవడం కూడా వీడియోలో కనిపిస్తోంది. విధినిర్వహణలో యువతితో ఇలా రాసక్రీడలు సాగించడంపై దర్యాప్తు జరిపి నివేదిక రాగానే నిందితుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజరు రవీందర్ గోయల్ చెప్పారు.