చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో వైఫై సౌకర్యం అదుర్స్!
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, దేశంలోనే వైఫై సౌకర్యం కలిగిన తొలి రైల్వే స్టేషన్గా అవతరించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ శుక్రవారం ఈ రైల్వే స్టేషన్ లో వైఫై సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాక తన మొబైల్లో వైఫై సౌకర్యాన్ని ఆయన పరిశీలించారు. ఇకపై చెన్నై రైల్వే స్టేషన్కు వచ్చే వారెవరైనా అరగంట పాటు తమ ల్యాప్ టాప్, మొబైళ్లలో ఉచితంగానే ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు.
అయితే ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చేందుకు మరిన్ని రోజుల సమయం పట్టే అవకాశముంది. ఉచిత ఇంటర్నెట్ సౌలభ్యంలో భాగంగా డౌన్ లోడింగ్పై ఎలాంటి పరిమితి లేనప్పటికీ, అప్ లోడింగ్పై మాత్రం ప్రయాణికులకు అనుమతి లేదు. ఇక 30 నిమిషాల పాటు ఉచితంగానే ఇంటర్నెట్ను వాడుకునే ప్రయాణికులు మరింత సమయం నెట్లో కొనసాగాలంటే, తమ అకౌంట్ల ద్వారా రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.