శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (12:51 IST)

కేవలం మూడు వేలకు కన్నతండ్రే కూతుర్ని అమ్మేశాడు.. గర్భవతి కావడంతో..?

కన్నతండ్రే కూతుర్ని అమ్మేశాడు. అది కూడా అక్షరాల మూడు వేల రూపాయలకు. ఈ ఘటన రెండేళ్ల క్రితం చోటుచేసుకోగా ఇప్పుడు వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను రెండేళ్ల క్రితం 21 ఏళ్ల యువకుడికి రూ. 3 వేలకు అమ్మేశాడు. అప్పుడామె వయసు 16 సంవత్సరాలు. ఇంట్లో పని చేయించుకునేందుకని చెప్పి ఆ బాలికను యువకుడు తీసుకెళ్లాడు.
 
కానీ ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసి హింసించాడు. ఈ క్రమంలో బాధితురాలు కొన్ని నెలల క్రితం గర్భం ధరించింది. దీంతో ఆ యువకుడు.. ఆమెను నడిరోడ్డుపై వదిలేశాడు. ఆమెతో డబ్బు లేకపోవడంతో వీధుల్లో తిరుగుతూ జీవనం సాగించింది. కో
 
విడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆమెను ఎవరూ ఆదుకోలేదు. మొత్తానికి ఈ ఏడాది మే నెలలో బాధితురాలిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీశారు. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నెల రోజుల క్రితం ఆమెను బిలాస్‌పూర్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.
 
తనకు జరిగిన ఘోర అవమానాన్ని సఖి కేంద్ర నిర్వాహకులకు బాధితురాలు చెప్పింది. రెండేళ్ల క్రితం తన అమ్మ చనిపోయినప్పుడు.. తనను ఓ యువకుడికి మూడువేలకు కన్నతండ్రి అమ్మేశాడని చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.