బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (16:59 IST)

రాజీవ్ గాంధీ హత్యను అమెరికా నిఘా సంస్థ ముందే పసికట్టిందట.. నివేదిక కూడా?

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21 వ, తేదిన తమిళనాడులోని శ్రీపెంరబుదూర్‌లో జరిగింది. అయితే రాజీవ్‍పై హత్యపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించింది. ఆప్టర్ రాజీవ్ పేరుతో 1986 లోనే సిఐఏ

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య 1991 మే 21 వ, తేదిన తమిళనాడులోని శ్రీపెంరబుదూర్‌లో జరిగింది. అయితే రాజీవ్‍పై హత్యపై అమెరికా నిఘా సంస్థ సీఐఏ ముందే హెచ్చరించింది. ఆప్టర్ రాజీవ్ పేరుతో 1986 లోనే సిఐఏ 23 పేజీల నివేదిక తయారుచేసింది. ఈ నివేదిక వివరాలు ఇటీవలే బయటపడ్డాయి. ఆయనపై దాడి జరిగే సూచనలున్నాయని సంస్థ అంచనా వేసింది. 
 
రాజీవ్ గాంధీ పదవికాలం ముగిసే నాటికి హత్యకు గురయ్యే అవకాశం ఉంది. ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న అతిపెద్ద ముప్పు హత్య ప్రయత్నమే అని సిఐఏ రాసింది. సిఐఏ ఇది రాసిన ఐదేళ్ళకు ఆయన హత్యకు గురయ్యాడు.
 
కాగా.. రాజీవ్ గాంధీ హత్యకు గురైతే ఖచ్చితంగా భారత్ అమెరికా, రష్యాలతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతోందని కూడా సీఐఏ ఆనాడే అంచనా వేసింది. పలువురు గ్రూపులు రాజీవ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అది ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందని సిఐఏ రిపోర్టు తెలిపింది. రాజీవ్ లేకుంటే ఆ సమయంలో పివి నరసింహరావు లేదా విపి సింగ్ లాంటి వారు ప్రధాని అభ్యర్థులుగా వచ్చే అవకాశం ఉందని సిఐఏ తెలిపింది.