శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (12:59 IST)

ఢిల్లీలో మరో ఘోరం... పదో తరగతి అమ్మాయిపై అత్యాచారం!

దేశ రాజధాని ఢిల్లీ నిజంగానే అత్యాచారాల కేంద్రంగా మారిందని చెప్పొప్పు. తాజాగా పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే... అత్యాచారానికి పాల్పడ్డ వారంతా ఆ అమ్మాయికి తెలిసిన వారే. వారం క్రితం జరిగిన ఈ ఘోరం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ టీనేజ్ యువతి వారం రోజుల క్రితం స్కూలు వెళుతుండగా, ఈ స్నేహితులంతా ఈ ఐదుమంది ఆమెను ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. వీరిలో ఒకడు ఆమెపై గన్ పెట్టి బెదిరించాడు. అనంతరం ఐదుమంది ఆమెను రేప్ చేశారు. ఈ దారుణాన్ని మొబైల్‌లో వీడియో కూడా తీశారు. జరిగిన విషయం గురించి ఎవరికైనా చెబితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని బెదిరించారు. 
 
దీంతో ఆమె భయపడిపోయింది. కానీ వారం రోజుల తర్వాత ఒంట్లో బాగాలేదని తల్లికి చెప్పడంతో... అమ్మయి తల్లి హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ఆసుపత్రిలో జరిగిన విషయం బయటపడింది. వెంటనే బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుమందిలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం.