శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (18:36 IST)

ప్రైవేట్ పాఠశాల ఓవరాక్షన్: తల్లిదండ్రుల్ని కలిశాడని బాలుడిని కొట్టిచంపేశారు.. ఎక్కడ?

ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలు పిల్లల్ని మంచిదారిన నడిపించేందుకు ఎంతగా ఉపయోగపడుతాయో ఏమో కానీ.. ఆ నిబంధనల కారణంగా ఓ పిల్లాడిని పొట్టన పెట్టుకున్న ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్‌లోని డాక్ బంగ్లా సమీపంలోని ఆల్ ఇస్లామియా మిషన్ పాఠశాలలో షమీమ్ మాలిక్ (12) అనే బాలుడు సోమవారం సాయంత్రం పాఠశాల బయట తల్లిదండ్రులను కలిశాడు.
 
అంతే అనుమతి లేకుండా.. తల్లిదండ్రుల్ని కలిశాడనే కారణంతో స్కూల్ హెడ్ మాస్టర్ హలీఫ్ షేక్, వార్డెన్ లీటన్ షేక్ ఒకరి తరువాత ఒకరు బాలుడిని తీవ్రంగా కొట్టారు. బాలుడనే దయ, కనికరం లేకుండా విచక్షణారహితంగా చితక్కొట్టడంతో బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో కొట్టడం మానేసిన ఈ టీచర్లు బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో షమీమ్ ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిద్దరినీ అరెస్ట్ చేశారు. తమను కలిశాడన్న కారణంగా తమ కుమారుడ్ని వారిద్దరూ హత్య చేశారని షమీమ్ తల్లి షమీనా బీబీ కన్నీరుమున్నీరయ్యారు.