బొగ్గు కుంభకోణంలో దాసరి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... మకిలి వదలదా...?
బొగ్గు కుంభకోణంలో దాసరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. దాసరి, జిందాల్ సహా పలువురిపై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఐపీసీ 120(బి), 420తో పాటు అవినీతి నిరోధక చట్టం ప్రకారం గత ఏడాదే చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది. జార్ఖండ్లోని అమర్కొండ
బొగ్గు కుంభకోణంలో దాసరి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. దాసరి, జిందాల్ సహా పలువురిపై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఐపీసీ 120(బి), 420తో పాటు అవినీతి నిరోధక చట్టం ప్రకారం గత ఏడాదే చార్జిషీటును సీబీఐ దాఖలు చేసింది.
జార్ఖండ్లోని అమర్కొండ, ముర్గదంగాల్ బొగ్గు క్షేత్రాలను అక్రమంగా జిందాల్ స్టీల్, గగన్ స్పాంజ్ కంపెనీలకు కేటాయింపులు జరిగాయని సీబీఐ తేల్చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ చార్జిషీటు ఇచ్చింది. దాసరి ముడుపులు అందుకున్నారని చార్జిషీటులో సీబీఐ పేర్కొంది.