మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (13:20 IST)

మన్మోహన్ సింగ్‌కు ఊరట: సీబీఐ సమన్లపై సుప్రీం కోర్టు ఊరట!

మన్మోహన్ సింగ్‌కు ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సుప్రీం కోర్టులో స్టే ఇవ్వడంతో మన్మోహన్ సింగ్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మన్మోహన్‌తో పాటు మరో ఐదుగురిపై ఈ కేసులో విచారణను నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లపై ఉన్నతన్యాయస్థానం స్టే విధించింది.
 
బొగ్గు కుంభకోణం వ్యవహారంలో తనకు ప్రమేయం లేదని మాజీ ప్రధాని మన్మోహన్‌ పెట్టుకున్న అభ్యర్థనపై సుప్రీం ఈ విధంగా స్పందించింది. మరో నాలుగు వారాల తరువాత ఈ కేసుకు సంబంధించిన విచారణను చేపట్టనున్నట్లు సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.