గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 జులై 2017 (12:07 IST)

వినతి పత్రం ఇచ్చేందుకు వెళితే పడకసుఖం కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పడకసుఖం ఇవ్వాలని బలవంతం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన ఆ మహిళ ఆత్యాచారయత్నానికి పాల్పడింది. ఈ కేసులో ఎమ్మ

సమస్య పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన ఓ మహిళను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పడకసుఖం ఇవ్వాలని బలవంతం చేశాడు. దీన్ని అవమానంగా భావించిన ఆ మహిళ ఆత్యాచారయత్నానికి పాల్పడింది. ఈ కేసులో ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. కేరళ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కేరళ, బలరామపురానికి చెందిన ఓ మహిళ తన భర్తతో కలిసి సమస్యలను వివరించేందుకు ఎమ్మెల్యేను కలిశారు. ఈ క్రమంలో తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఆ మహిళను ఎమ్మెల్యే బెదిరించాడు. ఎమ్మెల్యే వేధింపులు తాళలేక బుధవారం తన ఇంటిలో ఆమె నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. 
 
ప్రస్తుతం దవాఖానాలో చికిత్స పొందుతున్న మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు గురువారం రేప్ కేసు నమోదుచేశారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలన్నా, ప్రశ్నించాలన్న స్పీకర్ అనుమతి తీసుకోవాలి. తొలుత విన్సెంట్‌ను ప్రశ్నించేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో శనివారం నెయ్యటింకర పోలీసులు ఎమ్మెల్యే నివాస సముదాయంలో ప్రశ్నించారు. 
 
ఆ తర్వాత పెరూకడ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ అధికారి అజీత బేగం.. విన్సెంట్ వాంగూల్మాన్ని రికార్డు చేశారు. తర్వాత వైద్య పరీక్షల కోసం నెయ్యటింకర తాలుక దవాఖానకు తరలించారు.