గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (17:26 IST)

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు వెల్లడి.. పాతకాపులకు పెద్దపీట

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఇందులో పాతకాపులకు పెద్దపీట వేసింది. మొత్తం ఎనిమిది మంది పేర్లతో ఈ జాబితాను విడుదల చేయగా ఇందులో పార్టీకి చెందిన సీనియర్ నేతలందరినీ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది.
 
వీరిలో పి.చిదంబరం, అంబికా సోని, కపిల్ సిబల్, ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేష్, ప్రదీప్ టమ్టా, వివేక్ టంఖా, ఛాయావర్మలు ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర నుంచి కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, ఉత్తరప్రదేశ్ నుంచి సీనియర్ నేతలు కపిల్ సిబల్, కర్ణాటక నుంచి ఆస్కార్ ఫెర్నాండెజ్, జైరాం రమేష్, పంజాబ్ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అంబికా సోనీ, ఉత్తరాఖండ్ నుంచి ప్రదీప్ టమ్టా, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ టంఖా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఛాయావర్మలు రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది.
 
కాగా, క్రితంసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన జైరాం రమేష్‌ను ఈ దఫా కర్ణాటక నుంచి పంపించనున్నారు. మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసేందుకు విముఖత చూపిన చిదంబరంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కరుణ చూపి.. మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించడం ఢిల్లీలో చిదంబరంకు ఉన్న పలుకుబడిగా చెప్పుకోవచ్చు. రాజ్యసభలో ప్రధాని మోడీ సర్కారును ఎండగట్టేందుకే పార్టీ దిగ్గజాలను రాజ్యసభకు నామినేట్ చేసినట్టుగా ఉంది.