బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (11:50 IST)

పార్లమెంట్ సభా కార్యక్రమాలను అడ్డుకోండి.. ఎంపీలకు సోనియా ఆదేశం

ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రులతో పాటు వ్యాపం స్కామ్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేసేంత వరకు సభా కార్యక్రమాలను అడ్డుకోవాలని పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం. 
 
వ్యాపం స్కాం, లలిత్ గేట్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులు, సీఎంలతో రాజీనామా చేయించాల్సిందేనని డిమాండ్ ఆమె డిమాండ్ చేస్తున్నారు. ముందు చర్చించిన తర్వాతే చర్యలు అంటున్న బీజేపీ వైఖరి సరికాదని, అందుకు తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. బలమైన ఆధారాలతో కీలకమైన అంశాన్ని లేవనెత్తామని, ఆధారాలు ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ఎందుకు వెనుకాడుతోందన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన వైఖరిని వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.