బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (11:03 IST)

కాంగ్రెస్ పని మటాష్.. సోనియా ఏకాకి: హెచ్.ఆర్. భరద్వాజ్!

కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏకాకి అయ్యారంటూ ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ హాన్స్‌రాజ్ భరద్వాజ్ (హెచ్.ఆర్. భరద్వాజ్) సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
వరుసగా పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు గత సార్వత్రిక ఎన్నికల నుంచి వరుస ఓటములు ఎదురవుతున్న విషయం తెల్సిందే. దీంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
తాజాగా హాన్స్‌రాజ్ భరద్వాజ్ కూడా చేరారు. కాంగ్రెస్ పార్టీ ఇకపై ఏం చెప్పినా ప్రజలు వినిపించుకొనే స్థితిలో లేరని, కాంగ్రెస్ ఇక కోలుకోవడం కష్టమన్నారు. ఈ విషయంలో ఒంటరైపోయిన సోనియాను తాను నిందించడం లేదని ఆయన అన్నారు. 
 
ఇప్పటికీ ప్రియాంకా గాంధీని రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురాలేదో తనకు అర్థం కావడం లేదన్నారు. సచ్ఛీలుడైన మన్మోహన్ సింగ్ వంటి నేతకు సమన్లు వచ్చాయని, పరిస్థితి అంతవరకూ రాకుండా పార్టీ అడ్డుకోలేక పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.