బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (17:15 IST)

స్వామి గంగేశానంద కేసు... సీన్లోకి యువతి బాయ్‌ఫ్రెండ్.. నిర్భంధించారని హైకోర్టులో పిటిషన్

కేరళలో స్వామి గంగేశానంద అనే దొంగబాబా మర్మాంగాన్ని ఓ యువతి కత్తిరించి పారేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. దొంగ బాబా పేరిట లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలని మర్మాంగాన్ని కత

కేరళలో స్వామి గంగేశానంద అనే దొంగబాబా మర్మాంగాన్ని ఓ యువతి కత్తిరించి పారేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. దొంగ బాబా పేరిట లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి తగిన బుద్ధి చెప్పాలని మర్మాంగాన్ని కత్తిరించేసిన విద్యార్థిని ప్రస్తుతం అదృశ్యమైంది. ఈ మేరకు దొంగబాబా మర్మాంగాన్ని కోసేసిన విద్యార్థిని కనిపించట్లేదని ఆమె బాయ్‌ఫ్రెండ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే కేరళకు చెందిన గంగేశానంద స్వామి అదే ప్రాంతానికి చెందిన ఓ లా విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడగా, ఆ యువతి దొంగబాబా మర్మాంగాన్ని కోసిపారేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ తర్వాత ఆ బాబా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ.. ఉపయోగం లేని తన మర్మాంగాన్ని తానే కోసేసుకున్నట్టు ప్రకటించాడు. ఈ కేసుపై కేరళ ప్రత్యేక విభాగం పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతోంది. 
 
ఈ నేపథ్యంలో ఆ యువతి బాయ్ ఫ్రెండ్ సీన్లోకి వచ్చారు. బాబాపై దాడికి పాల్పడిన యువతిని గృహనిర్భంధంలో ఉంచారని, కిడ్నాప్ చేశారని.. ఆమె అదృశ్యమైందని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి సమాధానం ఇవ్వాలని కోరుతూ పోలీసులను కోర్టు ఆదేశించింది. 
 
కాగా, ఇప్పటికే స్వామి గంగేశానంద మర్మాంగాన్ని కోసేసిన కేసులో బాధితురాలే మాట మార్చింది. ఆయన తనకు తండ్రిలాంటివాడనీ, తనపై అత్యాచారం చేయలేదని, కేవలం దగ్గరకు తీసుకున్నారంతేనంటూ చెప్పింది. దీంతో ఆమెను పాలీగ్రాఫ్ పరీక్షకు పంపించాలని త్రివేండ్రం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.