శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 జూన్ 2017 (14:00 IST)

మనిషి ఆకారంలో లేగదూడ.. చనిపోయినా కళేబరానికి పూజలు.. విష్ణుమూర్తి అంటూ?

గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోమాంసం నిషేధానికి సంబంధించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చూసేందుకు మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆవుదూడను విష్ణుమ

గోపూజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గోమాంసం నిషేధానికి సంబంధించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చూసేందుకు మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆవుదూడను విష్ణుమూర్తిగా యూపీ ప్రజలు పూజిస్తున్నారు. అచ్చం మనిషిలా వుండే చెవులు, ముక్కు కళ్లతో ఉన్న దూడకు ఓ ఆవు జన్మనిచ్చింది. ఆ దూడ విష్ణు రూపమని, ఆ దేవుని ఆశీస్సులు తీసుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. అయితే ఆ దూడ మరణించింది. లేగ దూడ కళేబరాన్ని అలానే ఉంచి.. అందుకు దండలు వేసి పూజలు చేస్తున్నారు. మూడు రోజుల్లో మరణించిన దూడకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని ఆవు ఓనర్ తెలిపారు. త్వరలో దూడకు ఓ గుడి కూడా కట్టిస్తామని.. చెప్పారు. అయితే ఇవన్నీ మూఢనమ్మకాలని నాస్తికులు కొట్టిపారేస్తున్నారు.