మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 నవంబరు 2016 (16:28 IST)

పెద్ద నోట్ల రద్దుతో నరేంద్ర మోడీ దొంగల్ని కాపాడారు: నారాయణ ఫైర్

పెద్ద నోట్ల రద్దుతో నరేంద్ర మోడీ దొంగల్ని కాపాడారని సీపీఐ నేత నారాయణ తెలిపారు. మోడీ నిర్ణయం కార్పొరేట్ శక్తులను కాపాడేందుకేనని.. నోట్ల రద్దుతో కార్పొరేట్‌ కంపెనీలకు నష్టం వచ్చి ఉంటే ప్రధాని పదవి నుంచి

పెద్ద నోట్ల రద్దుతో నరేంద్ర మోడీ దొంగల్ని కాపాడారని సీపీఐ నేత నారాయణ తెలిపారు. మోడీ నిర్ణయం కార్పొరేట్ శక్తులను కాపాడేందుకేనని.. నోట్ల రద్దుతో కార్పొరేట్‌ కంపెనీలకు నష్టం వచ్చి ఉంటే ప్రధాని పదవి నుంచి మోడీని దింపేసేవాళ్లని నారాయణ విమర్శించారు. 3 నెలల ముందు బీజేపీ నేతల బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తే వారి బాగోతం బయటపడుతుందని నారాయణ చెప్పారు. 
 
నరేంద్ర మోడీ, వెంకయ్య, అమిత్‌షా 50 రోజులు అన్నం తినకుండా ఉంటే ప్రజలు కూడా సర్దుకుంటారని సీపీఐ నేత నారాయణ ఆక్షేపించారు. ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.లక్ష జమచేయాలని నారాయణ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నారాయణ తెలిపారు. నోట్ల రద్దు విషయం బడా వ్యాపారులకు ముందే తెలుసని వెల్లడించారు. ఈనెల 28న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.