బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 13 మే 2017 (17:56 IST)

పెళ్లికి నిరాకరించిందని ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్, ప్రైవేట్ భాగంలో పదునైన వస్తువులను...

వన్ సైడ్ లవ్ అనేది ఎంతటి దారుణాలను చేయిస్తుందో ఈ ఘటన చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నిర్భయ దాడికి మించిన దాడి చేసి ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన హర్యానాలో వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... హర్యానా సోనెపట్ జిల్లా రోహ్తక్ గ్ర

వన్ సైడ్ లవ్ అనేది ఎంతటి దారుణాలను చేయిస్తుందో ఈ ఘటన చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. నిర్భయ దాడికి మించిన దాడి చేసి ఓ మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన హర్యానాలో వెలుగుచూసింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... హర్యానా సోనెపట్ జిల్లా రోహ్తక్ గ్రామంలో తల్లిదండ్రులతో ఉంటోంది. ఆమె మే నెల 11వ తేదీన  విధులకు వెళుతున్న సమయంలో ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను ముక్కముక్కలుగా నరికేశారు రాక్షసులు. ఇంకా ఆమె ముఖం కూడా గుర్తుపట్టకూడదని ముఖంపై వాహనాన్ని నడిపి ఛిద్రం చేశారు. 
 
దారుణ స్థితిలో వున్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మే 9న ఘటన జరుగ్గా ఆ శవం ఎవరిదన్నది తెలుసుకునేందుకు పోలీసులకు మూడు రోజులు పట్టింది. కనిపించకుండా పోయిందన్న కేసుల ఆధారంగా ఆ మహిళ వివరాలను పోలీసులు కనుగొన్నారు. 
 
ఆ వివరాలిలా వున్నాయి... ఉద్యోగం చేస్తున్న ఆ యువతిని గత ఏడాదిగా సుమిత్ అనే యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. గత వారం క్రితం మళ్లీ ఆమెను పెళ్లాడాలని గొడవ చేయగా ఆమె అందుకు నిరాకరించింది. దీనితో అతడు కసితో ఊగిపోయాడు. ఆ తర్వాత ఆమె విధులకు వెళుతున్న సమయంలో మాటు వేసి తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. 
 
ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి సాక్ష్యం లేకుండా చేయాలని ఆమె తలపై వాహనాన్ని నడిపి ఛిద్రం చేశారు. ఇంకా కసి తీరక ఆమె వ్యక్తిగత ప్రదేశంలో పదునైన ఆయుధాలను చొప్పించారు. ఇదంతా ఫోర్సెనిక్ నివేదికలో వెల్లడైంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.