బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2014 (11:42 IST)

జయలలితకు బెయిల్ నో: విచారణ 7వ తేదీకి వాయిదా!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణకు చేపట్టిన కర్ణాటక హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది. జయలలిత బెయిల్ పిటిషన్‌ను రెగ్యులర్ బెంచ్ విచారణ జరుపుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో జయలలిత మరికొన్ని రోజులు జైళ్లోనే గడపనుంది.
 
జయలలిత తరుపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ ఈ వ్యవహారంలో వాదనలు వినిపించారు. రాం జెఠ్మలానీ వాదనలు వినిపిస్తున్న సమయంలో కోర్టు బయట అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలిత సెప్టెంబర్ 27 నుంచి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.