బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 26 మే 2016 (10:13 IST)

మిస్డ్‌కాల్‌తో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం.. ఆపై గ్యాంగ్ రేప్.. కర్ణాటకలో దారుణం!

కర్ణాటక రాష్ట్రంలో 22 యేళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ యువతి ప్రియుడే ఈ గ్యాంగ్ రేప్‌కు  పాల్పడ్డాడు. కర్ణాటకలోని చిక్కబళ్లాపుర నగరంలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఓ మిస్డ్‌కాల్‌తో పరిచయమైన యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. చిక్కబళ్లాపురకు చెందిన గిరీష్ శుక్రవారం ఈ యువతిని తన ప్రాంతానికి రప్పించాడు. 
 
గిరీష్ తన మిత్రులైన ఆటోడ్రైవర్లు శశిధర్, శివు, రమేష్‌బాబు ఆమెను ఓ గదిలో బంధించి నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలువారి నుంచి తప్పించుకుని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధతురాలు ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపడుతున్నారు.