శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (14:27 IST)

దొంగతనానికి యత్నించాడు.. అంతే... బాలుడిని కొట్టి చంపేశారు..

సోషల్ మీడియా ప్రభావంతో అమాయకులు బలైపోతున్నారు. వాట్సాప్‌లో వచ్చే వార్తల వల్ల జనాలు ఎదుటి వ్యక్తులను నమ్మకుండా వారిపై దాడి చేసే ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుక

సోషల్ మీడియా ప్రభావంతో అమాయకులు బలైపోతున్నారు. వాట్సాప్‌లో వచ్చే వార్తల వల్ల జనాలు ఎదుటి వ్యక్తులను నమ్మకుండా వారిపై దాడి చేసే ఘటనలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తూ దొరికిన ఓ పిల్లాడిని (16) కట్టేసి చావగొట్టడంతో ఆ దెబ్బలు తాళలేక ఆ బాలుడు మృతి చెందాడు.
 
వివరాల్లోకి వెళితే, ఢిల్లీలోని ముకుంద్ పూర్లో ఉంటున్న ఓ బాలుడు మరో ఇద్దరితో కలసి మంగళవారం రాత్రి ఓ ఇంట్లో చోరీచేసేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా ఈ ఇంట్లో ఉన్నవారు ఈ పిల్లాడిని పట్టుకుని స్తంభానికి కట్టేశారు. ఇది తెలుసుకుని అక్కడకు చేరుకున్న స్థానికులు రాత్రంతా ఈ బాలుడిపై విచక్షణారహితంగా దాడిచేశారు. అనంతరం ఉదయాన్నే రోడ్డుపై పడేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న పిల్లాడి బంధువులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దాడికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన వారిని పోలీసులకు అప్పగించాల్సిందిపోయి ఇలా దాడి చేయడం ఏమిటని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.