మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (14:53 IST)

సోదరిని ఏడిపించారు.. కత్తితో దాడి చేశారని.. మైనర్ ఆ ఇద్దరిని చంపేశాడు..

సోదరిని ఏడిపించి.. కత్తితో దాడికి పాల్పడిన వారిపై ఢిల్లీకి చెందిన మైనర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతీకారం కోసం రెండు హత్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సునీల్, కులదీప్ అనే ఇద్దరు యువకులు ప

సోదరిని ఏడిపించి.. కత్తితో దాడికి పాల్పడిన వారిపై ఢిల్లీకి చెందిన మైనర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రతీకారం కోసం రెండు హత్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గత ఏడాది సునీల్, కులదీప్ అనే ఇద్దరు యువకులు ప్రస్తుతం హత్యకు పాల్పడిన మైనర్‌తో తరచూ గొడవపడుతుండేవారు. ఓసారి మైనర్ సోదరిని ఏడిపించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న అతడిని కత్తితో పొడిచారు. ఈ ఘటనకు అనంతరం సునీల్ అనే వ్యక్తికి జైలు శిక్ష పడింది. ఆపై పెరోల్‌లో సునీల్ బయటికి వచ్చాడు. 
 
పెరోల్‌లో బయటికి రావడాన్ని తట్టుకోలేని మైనర్ తన స్నేహితుడు మనోజ్‌ను తన వెంటబెట్టుకుని ఖ్యాలా ప్రాంతానికి వెళ్లాడు. అతడితో ఏదో మాట్లాడాలని ఓ పార్క్‌కు పిలిచి ఓ ఐదు నిమిషాల తర్వాత నాలుగుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. అయితే మనోజ్ తల్లిదండ్రుల నుంచి ఫోన్ రావడంతో మైనర్‌ను వదిలి వెళ్ళిపోయాడు. కానీ మైనర్ అంతటితో ఆగకుండా కులదీప్ వద్దకు వెళ్లాడు. 
 
రాత్రి 11గంటల ప్రాంతంలో అతడిని బయటకు పిలిచి ఏకంగా 20సార్లు అదే కత్తితో పొడిచి చంపేశాడు. స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోగా తొలుత మనోజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి సహాయంతో మైనర్‌ను అరెస్టు చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇక ఎలాంటి గొడవలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ ఇద్దరిని తాను హతమార్చినట్లు మైనర్ అంగీకరించాడు.