శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 జూన్ 2017 (09:37 IST)

ప్రేమిస్తున్నానంది.. రాత్రంతా గడిపేందుకు వచ్చేసింది.. ఆపై ఏం జరిగిందంటే?

ప్రేమిస్తున్నానని ఆ యువతి చెప్పింది. రాత్రంతా నీతోనే గడుపుతానంది. చెప్పిన ప్రకారం ఇంటికొచ్చింది. యువకుడికి మద్యం తాగించింది. యువకుడు మద్యం మత్తులో ఉండగానే.. నగదు, ఐ-ఫోన్, స్కూటర్‌తో ఉడాయించింది. ఈ ఘట

ప్రేమిస్తున్నానని ఆ యువతి  చెప్పింది. రాత్రంతా నీతోనే గడుపుతానంది. చెప్పిన ప్రకారం ఇంటికొచ్చింది. యువకుడికి మద్యం తాగించింది. యువకుడు మద్యం మత్తులో ఉండగానే.. నగదు, ఐ-ఫోన్, స్కూటర్‌తో ఉడాయించింది. ఈ ఘటన దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని మానససరోవర్ గార్డెన్‌కు చెందిన ఓ యువకుడితో 23 ఏళ్ల ఓ యువతి ఫోన్‌లో మాట కలిపింది. మాటల్లో ప్రేమ ఒలకపోసింది. యువతి నేరుగా ఇంటికే రావడంతో ఆ యువకుడు ఎగిరిగంతేశాడు. అయితే ఆ యువతి ఇవ్వడంతో పీకలదాకా మద్యం తాగాడు. 
 
అంతే యువకుడు కాస్తా మత్తులోకి జారుకోగానే..  ఆమాయలేడీ యువకుడి ఐ ఫోన్, రూ.12వేల నగదు, స్కూటరును తీసుకొని పరారైంది. తెల్లవారాక స్పృహలోకి వచ్చిన యువకుడు జరిగిన మోసం గురించి తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, ఐ ఫోన్ సిగ్నల్ సాయంతో మాయలేడీ రఘుబీర్ నగర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి ఐ ఫోన్ తో పాటు స్కూటరును స్వాధీనం చేసుకున్నారు. యువతి పదోతరగతి వరకే చదివినా ఆంగ్ల భాషలో అనర్గళంగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతుందని విచారణలో వెల్లడైంది.