శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (14:53 IST)

రేపిస్ట్ డేరా బాబా డర్టీ పనులు.. అర్థరాత్రి డ్యాన్స్.. ఆపై హనీప్రీత్‌తో ఏకాంతంగా?

రేపిస్ట్ డేరా బాబా భక్తి ముసుగులో ఎందరో అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. అతడి క్రైమ్ స్టోరీలకు ముగింపు అంటూ లేకుండా పోయింది. డేరాలో డర్చీ పనులు చేస్తూ అమ్మాయిలను వాడుకుని చిప్పకూడు తింటున్నాడు. డేరా

రేపిస్ట్ డేరా బాబా భక్తి ముసుగులో ఎందరో అమ్మాయిల జీవితాన్ని నాశనం చేశాడు. అతడి క్రైమ్ స్టోరీలకు ముగింపు అంటూ లేకుండా పోయింది. డేరాలో డర్చీ పనులు చేస్తూ అమ్మాయిలను వాడుకుని చిప్పకూడు తింటున్నాడు.

డేరా బాబా తన ఆశ్రమంలో చేరిన అమ్మాయిలు సాధ్వీలుగా మార్చి తన వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేవాడు. అలా ఐదుగురు సాధ్విలు బాబాకు నచ్చిన అమ్మాయిలను అతని వద్దకు పంపేవారు. అలా పంపిన అమ్మాయిలతో డేరా బాబా రాత్రంగా గడిపేవాడు. దీనికోసం ప్రత్యేక దర్బార్ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. 
 
డేరాలో సరిగ్గా అర్థరాత్రి 12 గంటలకు డేరా బాబాలోని దుర్మార్గుడు బయటికి వస్తాడు. 1 గంటలకే డేరా తలుపులు తెరుస్తారు. 12 గంటలకు సింహాసనం మీద కూర్చునే అతడు ఒంటి గంట వరకు డ్యాన్స్ చేసేవాడట. ఆపై సాధ్విలపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఇవన్నీ ఐదుగురికి మాత్రమే తెలిసేవి. లెక్కలేనన్ని కార్లు, బంగ్లాలు ఆతనికి చిటికెలో చేతికి అందేవి. భక్తి ముసుగులో ఇన్నేళ్లు ఎవ్వరికీ తెలియకుండా అమ్మాయిలను లొంగదీసుకున్నాడు. 
 
నరకయాతన అనుభవించేలా చేశాడు. అలా అమ్మాయిలపై ఇష్టానుసారం అత్యాచారానికి పాల్పడిన డేరా బాబాకు హనీప్రీత్ దగ్గరైంది. వీరిద్దరి కోసం డేరాలో ప్రత్యేక రెసార్ట్ వుందని.. ఆ రెసార్ట్‌లో రామ్ రహీమ్, హనీ ప్రీత్ ఏకాంతంగా గడిపేందుకు అనేక సౌకర్యాలతో కూడిన గదులుండేవని.. అదే రెసార్ట్‌లో గర్ల్స్ హాస్టల్ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి బంధించేవారు.