ఢిల్లీ కాల్ సెంటర్ రేప్ కేస్ : దోషులకు జీవితఖైదు!
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిపై జరిగిన రేప్ కేసు దోషులకు సోమవారం జీవితఖైదు విధించారు. ఢిల్లీలోని ధౌలా క్వాన్ ప్రాంతంలో జరిగిన ఈ రేప్ కేసుకు సంబంధించి గతవారం జరిగిన విచారణలో ఈ ఐదుగురిని ఢిల్లీ సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
2010 నవంబర్ 24న బాధితురాలు విధులు ముగించుకుని వస్తుండగా, ఈ ఐదుగురు వ్యక్తులు కాల్ సెంటర్ ఉద్యోగినిని ఓ వాహనంలోకి బలవంతంగా ఎక్కించుకుని, అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డుపై విసిరేసి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను హర్యానాలోని మేవాట్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే