అయోధ్య స్థలం శ్రీరాముడిదే.. దీనిపై ఎలాంటి సందేహాలు వద్దు: ఉమా భారతి
వచ్చేయేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు మరోమారు అయోధ్య అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా.. కేంద్రంలోని అధికార బీజేపీతో పాటు.. వీహెచ్పీ, ఇతర సంఘ్ పరివా
వచ్చేయేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు మరోమారు అయోధ్య అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ముఖ్యంగా.. కేంద్రంలోని అధికార బీజేపీతో పాటు.. వీహెచ్పీ, ఇతర సంఘ్ పరివార్ సంస్థలు ఈ అంశాన్ని ప్రధానాంశంగా చేసుకుని ప్రచారాన్ని చేపడుతున్నాయి.
ఈపరిస్థితుల్లో కేంద్ర మంత్రి ఉమాభారతి మాట్లాడుతూ... వివాదాస్పద అయోధ్య స్థలం శ్రీరాముడికి చెందినదేనని ఉద్ఘాటించారు. ఈ అంశంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. పైగా, ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తూ రాజకీయం చేయొద్దని ఆమె కోరారు.
మరోవైపు.. అయోధ్య సమీపంలో 25 ఎకరాల్లో శ్రీరామునికి సంబంధించిన ఓ మ్యూజియాన్ని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ ఆ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర అధికార పార్టీ సమాజ్వాదీతో పాటు ప్రతిపక్ష బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.